ప్రతి స్కూల్ కి తప్పనిసరిగా ఇంటర్నెట్ సౌకర్యం సీఎం జగన్

రాష్ట్రంలోని ప్రతి స్కూల్ కి తప్పనిసరిగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలని సీఎం జగన్ (AP CM YS Jagan) స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి స్కూల్ కి తప్పనిసరిగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలని సీఎం జగన్ (AP CM YS Jagan) స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి స్కూల్ కు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో పాటు పాఠ్యాంశాలన్నీ పీడీఎఫ్ రూపంలో సేవ్ చేయాలని.. అవి నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారిని నియమించాలన్నారు. అలాగే పాఠశాలల్లో ఎలాంటి రిపేర్లు చేయాలన్నా.. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇక వచ్చే ఏడాది అమలు చేయనున్న జగనన్న విద్యాకానుక పథకంపై కీలక ఆదేశాలిచ్చారు. ఏప్రిల్ చివరినాటికే విద్యాకానుక కిట్ లోని వస్తువులను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ 

ఇక 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్ లపై సీఎం కీలక సూచనలిచ్చారు. ట్యాబ్ లను వెంటనే ప్రొక్యూర్ చేసేలా ఆదేశాలివ్వాలన్న సీఎం.. ప్రతి క్లాస్ రూమ్ లో డీజిటల్ టీచింగ్ కోసం టీవీ ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే దశలవారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాడు-నేడు పనులు పూర్తయిన స్కూళ్లపై ప్రధానంగా దృష్టిపెట్టాలని.. ఇందుకోసం ఎస్ఓపీలను రూపొందించాలన్నారు. తర్వాతి జరిగే సమావేశం నాటికి దీనికి సంబంధించిన విధివిధానాలను తన టేబుల్ పై ఉంచాలన్నారు సీఎం. రాష్ట్రంలోని ప్రతి స్కూల్ కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని.. బోధనాప్రమాణాలు పెరగాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి అని సీఎం అభిప్రాయపడ్డారు.

ప్రతి స్కూల్లో డిజిటల్ బోధన జరగాలని.., స్మార్ట్‌ టీవీ లేదా ఇంటరాక్టివ్‌ టీవీ ఖచ్చితంగా ఉండాలన్నారు. అలాగే బుక్స్ లో ఉండే పాఠాలకు సంబంధించిన కంటెంట్ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ప్రతిపాఠం పీడీఎఫ్ ఫార్మాట్ లో ఉండాలని.. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు పుస్తకాలు కావాలంటే.. నిర్ణీత సమయంలోగా ఆర్డర్ తీసుకొని అందించాలని స్పష్టం చేశారు. పుస్తకాల కొరత అనే మాట వినిపించకూడదన్నారు.

బాలికలకు భద్రతపై అవగాహన కల్పించాలని.., రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన పద్ధతిలో చెప్పాలన్నారు. గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచుగా స్కూళ్లకు వెళ్లి బాలికలకు రక్షణా పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి స్కూల్లో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై కౌన్సెలింగ్ ఇచ్చే బాధ్యతను ఒక మహిళా ఉపాధ్యాయురాలికి అప్పగించాలన్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండాలి, దీనికోసం ఎస్‌ఓపీలను రూపొందించాలి
ఒక ప్రత్యేక అధికారికి స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించండి
స్కూళ్లకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు నిర్వహించేలా విధానం ఉండాలి
వచ్చే సమీక్షా సమావేశం నాటికి దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలన్న సీఎం
ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాలని సీఎం ఆదేశాలు
అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలన్న సీఎం
అత్యుత్తమ బోధనకు ఇది దోహదపడుతుందన్న సీఎం
స్కూళ్లకు కాంపౌండ్‌ వాల్స్‌ తప్పనిసరిగా ఉండాలి, వీటిపై దృష్టిపెట్టాలి

జగనన్న విద్యా కానుకపై సీఎం సమీక్ష 
వచ్చే ఏడాది విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే అన్నిరకాలుగా సిద్ధంకావాలని సీఎం ఆదేశాలు
ఏప్రిల్‌ నాటికే విద్యా కానుక కింద అందించే వాటిని సిద్ధంచేసుకోవాలన్న సీఎం
సమావేశంలో పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్‌ నాణ్యతను పరిశీలించిన సీఎం.

ట్యాబ్‌ల పంపిణీపైనా సమీక్ష
8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించే కార్యక్రమంపైనా సీఎం సమీక్ష
టెండర్లు ఖరారుచేసి వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలని సీఎం ఆదేశం

తరగతి గదుల డిజిటలైజేషన్‌మీద సీఎం సమీక్ష
స్మార్ట్‌ టీవీ లేదా ఇంటరాక్టివ్‌ టీవీ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష
ప్రతి తరగతి గదిలోనూ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం
పాఠ్యపుస్తకాలకు సంబంధించిన కంటెంట్‌ను అందరికీ అందుబాటులో పెట్టండి
పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి
దీనివల్ల లిబరల్‌గా అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి
అంతేకాక ప్రభుత్వేతర స్కూళ్లు ఎవరైనా ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్యపుస్తకాలు కావాలనుకుంటే.. నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని ఆమేరకు వాటిని అందించండి
ఎక్కడా కూడా పాఠ్యపుస్తకాల కొరత అనేది ఉండకూడదు అధికారులకు స్పష్టం చేసిన సీఎం

బాలికల భద్రతపై అవగాహనరక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలన్న సీఎం జగన్‌
గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచుగా వీరిని కలిసి అవగాహన కల్పించాలన్న సీఎం జగన్‌
విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్ ‌కోసం నియమించాలన్న సీఎం జగన్‌

Previous Post Next Post

Contact Form