Telugu Educational News 3rd Oct 2022

ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయో పరిమితి పెంపు వెసులు బాటును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 సెప్టెంబర్ 27న జారీ చేసిన జీవో 105 ను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగించింది. 2023 సెప్టెంబర్ వరకు ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీపీఎస్సీ సహా మిగతా ప్రభుత్వ నియామక సంస్థలు ఈ అంశాన్ని నోటిఫై చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అటు ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ -1 ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూ లు నిర్వహించాలని సర్కారు. నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులిచ్చింది.

దసరా సెలవుల్లో క్లాసులు నడిపితే కఠిన చర్యలు

ఇంటర్ బోర్డ్ హెచ్చరిక
🌻అమరావతి, ఆంధ్రప్రభ:ప్రయివేట్, అన్ ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజీ లు దసరా సెలవుల్లో విద్యార్ధులకు ఎటువంటి క్లాసులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు హెచ్చరించింది. ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు ప్రిన్సిపాల్స్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈమేరకు ఆదివారం ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈమేరకు ప్రాంతీయ పర్యవేక్షక అధికారులు కాలేజీలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈనెల రెండో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు పెంపు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువును ఈనెల 15వ తేదీ వరకు పెంచినట్లు యూనివర్సిటీ స్టడీ సెంటర్ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం. అజంతకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్, ఐటీఐ, ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులయిన వారు, పీజీలో ప్రవేశాలకు మూడేళ్ల డిగ్రీ పూర్తిచే సిన వారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరింత సమాచారం కోసం 0866-2434868లో సంప్ర దించాల్సిందిగా ఆయన కోరారు.


మండలిని రద్దుచేస్తామంటూ బెదిరించారు

  • ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం
  • పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన యూటీఎఫ్
బిల్లులు ఆమోదం పొందకుండా చేసినందుకు, తమను బెదిరించడానికి పాలకులు మండలిని రద్దుచేస్తామని చెప్పారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తెలిపారు. అలా చేసినా నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని పేర్కొన్నారు. వచ్చేఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ మద్దతిస్తున్న పీడీఎఫ్ అభ్య ర్థుల పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. సామాజిక ఉద్య మాల్లో ఉంటూ, మచ్చలేని వారిని అభ్యర్థులుగా ప్రకటించామన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు కాపాడా లన్నా, నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నా.. పీడీఎఫ్ ఎమ్మెల్సీల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ షేక్ సాల్జీ మాట్లాడుతూ సీపీఎస్ రద్దుచేసి, ఓపీఎస్ చేయాలా? లేకపోతే జీపీఎస్ ను అంగీకరించాలా? అనేదానిపై త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే ఎన్నికలను రెఫరెండంగా భావించాలని కోరారు.

*ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్య ర్థిగా పి. బాబురెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎం. వెంకటేశ్వర రెడ్డి, ఉమ్మడి కడప, కర్నూలు అనంతపురం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్య ర్థిగా కత్తి నర్సింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల నాగరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. రమాప్రభకు యూటీ ఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్ తెలిపారు.

మధ్యాహ్న భోజనం తయారీకిచ్చే మొత్తం పెంపు..

రెండేళ్ల తర్వాత 9.60 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం!
దేశవ్యాప్తంగా విద్యార్థులకు 'మధ్యాహ్న భోజనం' తయారీలో వంట ఏజెన్సీలకు అందజేసే మొత్తం పెరగనుంది. కొన్నేళ్లుగా ఏటా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏడు శాతం వంతున పెంచుతోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆ మాటెత్త లేదు. మరోవంక.. ధరల మంట నేపథ్యంలో వివిధ తరగతుల విద్యార్థులకు భోజనం తయారీకి ప్రభు త్వాలు చెల్లించే ధరను పెంచాలని వంట ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నిపు ణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ కొద్ది నెలల క్రితం నివేదికను సమర్పించింది. ఎన్ఐఎన్ మాత్రం 1-5 తరగతుల విద్యార్థులకు రూ.10లు, ఇతరులకు రూ.12లకు పెంచాలని సిఫారసు చేసినట్లు సమా చారం. మొత్తానికి 20 శాతం వరకు పెంచవచ్చని విద్యాశాఖ అధికారులకు సమాచారం ఉంది. అందుకు భిన్నంగా ఇప్పుడు చెల్లిస్తున్న ధరలపై 9.6 శాతం పెంచేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ మొత్తంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా భరిస్తాయి.

కొత్త పీఆర్సీ జీతాల్లో భత్యాలకు కత్తెర

ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగుల ఖాతాల్లో నేడో, రేపో వేతన సవరణ (పీఆర్సీ) తో కూడిన కొత్త జీతాలు జమవుతాయి. ఉద్యోగులంతా తమ జీతాలు ఎంత పెరిగాయో నని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త జీతాల్లో భత్యాలను జత చేయకుండా నిలిపేశారు. దీంతో ఓవరైమ్ (ఓటీ)తోపాటు, వివిధ భత్యాల రూపంలో ఉద్యోగులకు దక్కాల్సిన సొమ్ము ఈ నెల జీతాలతో కలిపి రాదని తెలిసింది. మూలవేతనాన్ని చివరి నిమిషంలో ఖరారు. చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆర్టీసీలో 51,488 మంది ఉద్యో గులుండగా.. వీరందరికీ జూన్ నుంచి కొత్త పీఆర్సీ అమలవుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే పలు కారణాలతో జూన్, జులై, ఆగస్టు జీతాల్లో పీఆర్సీ అమలు చేయలేదు. పదోన్నతులు పొందిన 2,096 మంది మినహా మిగిలిన వారికి.. అక్టోబరులో వచ్చే జీతంలో కొత్త పీఆర్సీ అమలు చేశారు. ఇందులో మూలవేతనం, డీఏ, హెచ్ఎస్ఏ, సీసీఏ తదితరాలే చూపారు. 45 వేల మందికి పైగా ఉద్యోగు లకు లభించే ఓటీ, డే ఔట్, నైట్ ఔట్, నైట్ షిఫ్ట్ భత్యాలు కలపలేదు. దీంతో ఉద్యోగులకు రూ.5-10 వేలు తగ్గనుంది.

మూల వేతనం ఖరారులో జాప్యం
ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం మూలవేతనం ఎంతనేది. ఖజానా శాఖ ఖరారుచేసి గత నెల చివర్లో ప్రకటించింది. దీంతో మూల వేతనం ఆధారంగా లెక్కించాల్సిన ఓటీ వివరాలను ఆర్టీసీ అధికారులు ఇవ్వలేకపోయారు. దీనివల్ల ఓటీ, ఇతర భత్యాలను కలపలేదని చెబు తున్నారు. ఈ భత్యాలన్నింటినీ వచ్చే నెల ఇచ్చే జీతంలో కలిపి ఇస్తా మని అంటున్నారు. ఆర్టీసీలో 45 వేల మందికి రావాల్సిన భత్యాలన్నీ కలిపి రూ.4 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.

• కొత్త జీతాల పే స్లిప్స్ బయటకు వచ్చాయి. వాటిని గత నెల జీతాలతో పోలిస్తే.. ఎక్కువ మందికి పీఆర్సీ వల్ల పెద్దగా జీతం పెరగలేదని, డీఏ పెంపుతోనే జీతాలు పెరిగాయని చెబుతున్నారు. డీఏ 11.6శాతం నుంచి 20.02 శాతానికి పెంచారు. దీనివల్ల జీతాల్లో పెరుగుదలకనిపిస్తోందని ఉద్యోగులు అంటున్నారు

సీబీఎస్‌ఈపై.. సందేహాలు

  • కమిటీ అనుమతిపై అనుమానాలు
  • జిల్లాలో 14 పాఠశాలల కోసం ప్రతిపాదనలు
  • సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం సౌకర్యాలు అంతంతే
  • త్వరలో పరిశీలనకు రానున్న సీబీఎస్‌ఈ కమిటీ సభ్యులు
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌ మార్పు జరిగేనా?
🌻గుంటూరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): పేదలు కూడా సీబీఎస్‌ఈలో బడుల్లో చదువుకోవాలి. ఆ విధంగా చేస్తాం.. వచ్చే విద్యా సంవత్సరంలోనే సీబీఎస్‌ఈ పాఠశాలలు అందుబాటులోకి తెస్తాం.. అని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో 14 పాఠశాలలను ఎంపిక చేసి సీబీఎస్‌ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే ఆయా పాఠశాలల్లో ఉన్న పరిస్థితులు, వసతులను బట్టి చూస్తే సీబీఎస్‌ఈ కమిటీ అనుమతి ఇస్తుందో, లేదోనన్న సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. ఇందుకు మూల కారణం సీబీఎస్‌ఈ నియమ, నిబంధనలు పకడ్బందీగా ఉంటాయి. విశాలమైన తరగతి గదులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ప్లేగ్రౌండ్‌, ల్యాబ్‌లు వంటి అనేక సదుపాయాలు కలిగివుండాలి. అప్పుడే సీబీఎస్‌ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నీ సంతృప్తికరంగా ఉంటేనే ఆమోదం తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదించిన 14 జడ్పీ పాఠశాలల్లో ఎన్నింటికి అనుమతులు వస్తాయోనన్న సందేహాలు కలుగుతోన్నాయి. జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న జిల్లాపరిషత్‌ హైస్కూళ్లలో వందల మంది విద్యార్థులు చదువులు సాగిస్తోన్నారు. వీరంతా తెలుగు మీడియంలోనే చదువుకుంటున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను సీబీఎస్‌ఈలోకి మార్చేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాలో 14 స్కూళ్లని రాబోయే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ స్కూల్స్‌గా మార్చేందుకు ప్రతిపాదించింది. అయితే సీబీఎస్‌ఈ పాఠశాలలుగా గుర్తింపునకు కమిటీ నియమ, నిబంధనలు పకడ్బందీగా ఉంటాయి. ఆయా నియమ నిబంధనలు అన్నీ సక్రమంగా ఉంటేనే సీబీఎస్‌ఈ పాఠశాలలుగా గుర్తింపు ఇస్తోంది. లేదంటే లేదు. గుంటూరు నగరంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యంలో కొనసాగుతోన్న సీబీఎస్‌ఈ స్కూళ్లని చేతివేళ్లతో లెక్కించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నల్లపాడులో కేంద్రీయ విద్యాలయం ఉన్నది. అలానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో భారతీయ విద్యాభవన్‌ ఉన్నది. మిగతావి మిషనరీస్‌, ప్రైవేటు విద్యా సంస్థలే. వాటిల్లో అకడమిక్‌ కరిక్యులమ్‌ వేరుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని ఏకంగా 14 జడ్పీ పాఠశాలలను సీబీఎస్‌ఈగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన ఆయా పాఠశాలల్లో సరైన వసతులు లేవు. భవనాలు సక్రమంగా ఉంటే సరైన సౌకర్యాలు ఉండవు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విశాలమైన ప్రాంగణం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఉపాధ్యాయులు లేరు. ఇక ల్యాబ్‌లు అయితే మచ్చుకు కూడా కానరావు. మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేక పోవడంతో అవి అధ్వానంగా ఉంటాయి. ఇక గదులు ఉన్నా అవి ఇరుకుఇరుకుగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో సీబీఎస్‌ఈ కమిటీ పరిశీలనలో వీటిని పరిగణనలోకి తీసుకుంటే అనుమతిపై కష్టమేనని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం జడ్పీ హైస్కూళ్లలో తరగతులు బోదిస్తోన్న వారికి సీబీఎస్‌ఈ సిలబస్‌ గురించి అంతగా అవగాహన లేదు. జడ్పీ హైస్కూళ్లలో నాడు - నేడు కింద అంతంత మాత్రంగానే పనులు జరుగుతోన్నాయి. వాటిల్లో చాలావరకు మరమ్మతులే ఉంటోన్నాయి. అరకొరగా అదనపు తరగతి గదులు, డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లకు నిధులు వెచ్చిస్తోన్నారు. బెంచీలు, బ్లాక్‌బోర్డులు వంటివి మాత్రమే ఏర్పాటు చేస్తోన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కారణంగా పాఠశాలల్లో క్రీడా మైదానాల వైశాల్యం తగ్గిపోతోన్నది. ల్యాబ్‌లు భూతద్దం పెట్టి వెదికినా కనిపించవు. ఆయా సౌకర్యాల గురించి పట్టించుకోకుండా పొన్నూరులోని నిడుబ్రోలు, వేజండ్ల, వెనిగండ్ల, మంగళగిరిలో రేవేంద్రపాడు, నిడమర్రు అండ్‌ చినకాకాని, పెనుమాక స్కూళ్లని సీబీఎస్‌ఈ మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అలానే ప్రత్తిపాడు పరిధిలో జొన్నలగడ్డ, ప్రత్తిపాడు, తుళ్లూరు మండలంలో తుళ్లూరు, మేడికొండూరు మండలంలో సిరిపురం, తాడికొండలో రావెల, తెనాలిలో సంగంజాగర్లమూడి జడ్పీ హైస్కూళ్లని ప్రతిపాదించింది. అయితే వీటిల్లో ఎక్కువ స్కూళ్లలో సీబీఎస్‌ఈ నిబంధనలకు సరితూగేవి లేవన్నది ఉపాధ్యాయవర్గాల అభిప్రాయం. కాగా త్వరలో సీబీఎస్‌ఈ బృందం జిల్లాకు వచ్చి ఆయా స్కూళ్లని పరిశీలించనున్నది. ఆ తర్వాతే వాటి భవితవ్యం తేలుతుంది. జిల్లాలో ప్రస్తుతం సీబీఎస్‌ఈ స్కూళ్ల సంఖ్య చాలా పరిమితంగా ఉన్నది.

దసరాకు పస్తులే!

  • ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందని జీతాలు
  • ఎదురుచూస్తున్న టీచర్లు, పీటీడీ ఉద్యోగులు
  • అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదీ అదే పరిస్థితి
అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతినెలా జీతాల బట్వాడాలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఈనెల ఒకటో తేదీన టీచర్లతో పాటు ప్రజా రవాణా ఉద్యోగులు, కార్మికులకు జీతాలు జమకాలేదు. దసరా పండగ నేపథ్యంలో కచ్చితంగా జీతాలు తమ ఖాతాల్లో జమవుతాయని భావించిన వీరంతా పండగ పూటా పస్తులుండాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో 12 వేలమంది ఉపాధ్యాయులు, 5,500 మంది ప్రజారవాణా ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. ఇతర శాఖలు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మరో 20 వేల మంది వరకు ఉంటారు. వీరిలో టీచర్లు, పీటీడీ ఉద్యోగులు, కార్మికులతోపాటు మరికొన్ని శాఖల ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఈనెల ఒకటో తేదీన జీతాలు అందలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన జీతాలు రాకపోవడం షరామామూలు వ్యవహారంగా మారిపోయినప్పటికీ, కనీసం దసరా సందర్భంలో కచ్చితంగా జమవుతాయని భావించినా వీరికి నిరాశ ఎదురయింది. ఈ నెల రెండోతేదీ ఆదివారం, సోమవారం దుర్గాష్టమి సెలవులు. మంగళవారం జీతాలు వేస్తే సరి... లేకపోతే ఐదోతేదీ విజయదశమి సెలవు. ఈ నేపథ్యంలో పండగ తరువాతే జీతాలు అందే అవకాశముందని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండగ ఖర్చులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ కంపెనీలకు ఈఎంఐలు చెల్లించేందుకు తీవ్ర అవరోధం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత తేదీలోగా ఈఎంఐ చెల్లించకపోతే అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.

మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

జీతాల బట్వాడాలో ప్రతినెలా జాప్యం నెలకొంటుండడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతిరోజూ కచ్చితమైన సమయానికి పాఠశాలకు వెళ్లాలని, తమ సొంత ఫోన్లలోనే ఫేషియల్‌ యాప్‌ ద్వారా హాజరు వేయాలని షరతులు విధించిన ప్రభుత్వం, ఒకటో తేదీనే జీతాలు ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి.

కరిగిన కాలం .. పరీక్షలే ప్రశ్నార్థకం

ఏటా జూన్ రెండో వారం లోపు విద్యాసంవత్సరం ప్రారంభం కావడం ఆనవాయితీ . రెండేళ్లుగా ఇది మారింది . 2021-22 విద్యాసంవత్సరంలో కరోనా కారణంగా నవంబరు నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి . ఈ ఏడాది మూడు వారాలు ఆలస్యంగా జులై 5 తేదీ విద్యాసంవత్సరం ఆరంభమైంది . ప్రస్తుతం విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు . వారం రోజుల తరువాత పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి . ఇంతవరకు చెప్పిన పాఠ్యాంశాల్లో విద్యార్థులకు ఏమేరకు పట్టు వచ్చిందో తెలుసుకోవడానికి ఒక్క పరీక్ష కూడా జరగకపోవడం విశేషం . ఏటా నాలుగు యూనిట్ టెస్టులు ( ఒక్కోటి 25 మార్కుల వంతున ) నిర్వహించేవారు . త్రైమాసిక ( దసరా ) , అర్ధసంవత్సరం ( సంక్రాంతి ) , ఏప్రిల్లో వార్షిక పరీక్షల నిర్వహణతో విద్యా సంవత్సరం ముగుస్తోంది .

ఆబ్జెక్టివ్ , ఓఎంఆర్ రూపంలో ..
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 20 మార్కులకే యూనిట్ టెస్టులను పరిమితం చేశారు . అందులోనూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 15 మార్కులు , మరో ఐదు మార్కులకు వ్యాసరూప ప్రశ్న ఇచ్చేలా ప్రశ్నపత్రం రూపొందిస్తున్నారు . ఈ ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు కూడా ఓఎంఆర్ షీట్లపైనే సమాధానాలు రాయాలి . పెద్ద పెద్ద పోటీ పరీక్షలకు మాదిరి బబ్లింగ్ చేసే క్రమం బాల్యం నుంచే అలవరుస్తుండడం గమనార్హం . దీంతో జిజ్ఞాస , భావ వ్యక్తీకరణకు తావివ్వక చిన్నతనం నుంచే లక్కీ డ్రా మాదిరిగా ఏదో ఒకటి తగలకపోతుందా అనే ధోరణి ఏర్పడుతుంది .


ప్రామాణికాల కోసమే- ప్రతాప్ రెడ్డి , డైరెక్టర్ , రాష్ట్ర విద్యా శాఖ రిసోర్స్ ట్రైనింగ్ సెంటర్
ప్రామాణికాల కోసమే పరీక్షా మార్పులు తీసుకొచ్చాం . యూనిట్ విధానంలో టెస్ట్ల స్థానంలో ఫార్మెటివ్ అసిస్మెంట్ పద్దతి తీసుకొ స్తున్నాం . దసరా సెలవుల అనంతరం ఈ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేస్తాం . కొన్ని సబ్జెక్ట్ కు బేస్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాం .


యూనిట్ టెస్టులేవీ ?
గతంలో దసరా సెలవులు ఇచ్చే లోపే జులైలో తొలి , ఆగస్టులో మలి యూనిట్లు సహా త్రైమాసిక పరీక్షలు పూర్తయ్యేవి . ఈ సారి త్రైమాసికం కాదు కదా యూనిట్ పరీక్షలు కూడా నిర్వహించలేదు . గత ఏడాది కరోనా కారణంగా నాలుగుకి బదులుగా మూడు యూనిట్ టెస్టులు నిర్వహించారు . ప్రస్తుతం యూనిట్ పరీక్షలను ఫార్మెటివ్ అసెస్మెంట్ 1,2,3,4 లుగా మార్చారు . త్రైమాసిక పరీక్షలను సమ్మెటివ్ అసిస్మెంట్ -1 , అర్ధ సంవత్సర పరీక్షలను సమ్మెటివ్ అసిస్మెంట్ -2 గా మార్చారు .
Previous Post Next Post

Contact Form